న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ నేత కమల్నాధ్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారం ప్రజల గోప్యతపై అతిపెద్ద దాడిగా ఆయన అభివర్ణించారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై దర్యాప్తు చేపట్టాలని కమల్నాధ్ డిమాండ్ చేశారు. ఈ స్పైవేర్ను తాము ఉపయోగించలేదని కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధానంలో అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు.
పెగాసస్ స్పైవేర్తో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడలేదని కేంద్ర ప్రభుత్వం తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చుతోందని, అయితే సుప్రీంకోర్టుకు ఈ మేరకు అఫిడవిట్ సమర్పించాలని డిమాండ్ చేశారు. పెగాసస్ స్పైవేర్తో పలువురు జర్నలిస్టులు, విపక్ష నేతల ఫోన్లను హ్యాక్ చేశారనే ఆరోపణలు పెనుదుమారం రేపిన సంగతి తెలి
సిందే.