హైదరాబాద్, (నమస్తే తెలంగాణ) : దేశంలో మానవ అక్రమ రవాణా, బలవంతపు శ్రమ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రానున్న వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్లో యాంటీ ట్రాఫికింగ్(అక్రమ రవాణా వ్యతిరేక) బిల్లును ఆమోదించాలని నోబల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి భారతదేశంలో పేద మహిళలు, పిల్లల అక్రమ రవాణాకు కారణమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.