కాఠ్మాండూ: హిమాలయ దేశమైన నేపాల్ ప్రధానిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ(69) శుక్రవారం మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. గత సోమవారం పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన కేపీ శర్మకే రాష్ట్రపతి మరోసారి అవకాశం ఇచ్చారు. 275 మంది సభ్యులున్న సభలో 4 సభ్యులు సస్పెన్షన్లో ఉన్నారు. ప్రస్తుతం 271 స్థానాలు ఉన్న పార్లమెంట్లో ఓలీ సారథ్యంలోని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీకి 121 మంది సభ్యుల బలం ఉంది. విశ్వాస పరీక్షలో ఓలీ ఓడిపోయిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో విపక్షాలు విఫలమయ్యాయి.
దీంతో దేశాధ్యక్షురాలు విద్యాదేవి భండారీ అతిపెద్ద పార్టీ అధినేతగా ఉన్న ఓలీకి మళ్లీ సర్కార్ ఏర్పాటు చేసే అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించింది. అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ శుక్రవారం మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఓలీ 30 రోజుల్లో ప్రతినిధుల సభలో బల పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంది.