చెన్నై: పుదుచ్చేరి లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా కే లక్ష్మీనారాయణన్ ఎన్నికయ్యారు. ఆ మేరకు ఈ ఉదయం ఆయన ప్రమాణస్వీకారం కూడా చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా, ఇటీవల జరిగిన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకున్నది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది.