భీమదేవరపల్లి, ఏప్రిల్ 11 : మహాత్మా జ్యోతిరావుఫూలే జయంతి వేడుకలను జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫూలే విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. ములుకనూరు, కొత్తపల్లి, గాంధీనగర్, మాణిక్యాపూర్ గ్రామాల్లో జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు జరిగాయి. కార్యక్రమాల్లో జడ్పీటీసీ వంగ రవి, సర్పంచ్లు మాడుగుల కొంరయ్య, పొన్నాల హేమలత, వేల్పుల రవి, తాళ్లపల్లి తులసమ్మ, ఎంపీటీసీలు మామిండ్లపల్లి గోపీశర్మ, బొల్లంపల్లి రమేశ్, అప్పని పద్మ, మండల సురేందర్, దళిత సంఘాల నాయకులు కండె సుధాకర్, చెప్యాల ప్రకాశ్, రేణికుంట్ల భిక్షపతి, ఎదులాపురం తిరుపతి, కండె సంజీవ్, అంబాల చక్రపాణి, మాడుగుల అశోక్, తాళ్లపల్లి కుమార్, అనపురం రమేశ్, కొంగల రాంచంద్రారెడ్డి, చంద్రశేఖర్గుప్త, కూన భిక్షపతి, కొదురుపాక సాధన్ పాల్గొన్నారు.
ఎల్కతుర్తిలో..
ఎల్కతుర్తి : మహాత్మాజ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్ఎస్ఎఫ్ బాధ్యులు నిర్వహించారు. అనంతరం ఏప్రిల్ 14 వరకు భీం ప్రతిజ్ఞ వారోత్సవ దీక్షలు తీసుకున్నారు. అలాగే, పెంచికల్పేట గ్రామంలో ఫూలే చిత్రపటానికి టీఎస్ ఎమ్మార్పీఎస్ నాయకులు నివాళులర్పించారు. ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నాస్తిక్ రాకేశ్, నాయకులు గొర్రె శ్రీనివాస్, ఏలబోయిన నవీన్, బాన్సువాడ నవీన్, అంబాల సాగర్, కట్కూరి అనిల్, తూముల రాజ్కుమార్, ఎర్రోల్ల సురేశ్, మొగిలి, భిక్షపతి, రాములు పాల్గొన్నారు.
కమలాపూర్లో..
కమలాపూర్ : మండల కేంద్రంలోని మంత్రి ఈటల రాజేందర్ నివాసంలో జ్యోతిబాఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈటల భద్రయ్య, సింగిల్ విండో చైర్మన్ సంపత్రావు, ఉపసర్పంచ్ మౌటం రమేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాట్ల రమేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్, ఇల్లంతకుంట దేవస్థానం డైరెక్టర్ అరవింద్, నాయకులు నవీన్కుమార్, శ్రీకాంత్, తిరుపతిరెడ్డి, రాంచందర్, శోభన్, టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు రాజ్కుమార్, నియోజకవర్గ సంయుక్త కార్యదర్శి సతీశ్, కల్యాణ్, రాజేశ్, విజేందర్, మహేశ్, వినయ్, సాగర్, శ్రీశైలం, రంజిత్,రాజేశ్, అరుణ్ పాల్గొన్నారు.
బొల్లికుంటలో ..
ఖిలావరంగల్ : గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్లోని బొల్లికుంటలో ఆదివారం మహాత్మాజ్యోతిరావుఫూలే జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఖిలావరంగల్ పీఏసీఎస్ వైస్ చైర్పర్సన్ సోల్తీ భూమాత, డైరెక్టర్ వీరారెడ్డి, మాజీ కార్పొరేటర్ పసూనూరి స్వర్ణలత, రైతు బంధు సమితి అధ్యక్షులు టీ రవీందర్రెడ్డి, మాజీ ఎంపీటీసీలు ఎల్లాగౌడ్, రాజాగౌడ్, సోల్తీ నరేంద్ర, వేమన్రెడ్డి, భాస్కర్రెడ్డి, శ్రీకాంత్, రాజు పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్ సెంటర్లో..
పోచమ్మమైదాన్ : వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్లో అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు ఫూలే 194వ జయంతి వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఆడెపు రవీదర్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానికులకు ఆడెపు రవీందర్ పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు పడాల నరేందర్, నందాల చందర్బాబు, డీఎస్ మూర్తి, పద్మశాలి సంఘం అధ్యక్షుడు రమేశ్, మల్లేశం, నవీన్, రాధమ్మ, సురేశ్, అనిల్ పాల్గొన్నారు.
తిలక్రోడ్డులో..
కాశీబుగ్గ : కాశీబుగ్గ తిలక్రోడ్డులోని స్కాలర్స్ హైస్కూల్లో ఆదివారం జ్యోతిరావు ఫూలే జయంతి నిర్వహించారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగ వెంకట్రాజం పూలే చిత్రపటానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో బుట్టి రంజిత్కుమార్, నాంపల్లి అశోక్ పాల్గొన్నారు
జోత్యిబాఫూలేనగర్లో..
నగరంలోని జ్యోతిబాపూలేనగర్లో మహాత్మాజ్యోతిరావుఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బోడ డిన్నా, మహాత్మా జోత్యిరావుఫూలే అవార్డు గ్రహీత, బీసీ స్టడీ ఫోరం కన్వీనర్ సాయిని నరేందర్, న్యాయవాది రాచకొండ ప్రవీణ్కుమార్, కాలనీ కమిటీ బాధ్యులు పీ శ్రీకాంత్, డాక్టర్ తిరుపతి, బాలరాజు, ఉపాధ్యాయులు రామకృష్ణ, నాగరాజు, పద్మనాభం, రాజేందర్, ఆంజనేయులు, పోశాలు, సాయిని నర్సింహ్మయ్య, దిడ్డి శరత్కుమార్, శ్రీనాథ్, శ్రీనివాస్, రాంబాబు పాల్గొన్నారు.
ధర్మసాగర్లో..
ధర్మసాగర్ : మండల కేంద్రంలో జరిగిన జోత్యిరావుఫూలే జయంతి వేడుకల్లో ఎమ్మార్పీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గంగారపు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు బొడ్డు భరత్, టీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి చాడ కుమార్ పాల్గొన్నారు. అదేవిధంగా మల్లకపల్లె గ్రామంలో తెలంగాణ దళిత జనకళా మండలి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మంద స్వామి ఆధ్వర్యంలో ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. నాయకులు మాదాసు వెంకటేశ్, తెలంగాణ అంబేద్కర్ సంఘం గ్రామ అధ్యక్షుడు తాటికాయల కొమురయ్య, ఉపాధ్యక్షుడు శంకర్, నాయకులు రాజు, సుమన్, ఎల్లస్వామి, నగేశ్ పాల్గొన్నారు.
వేలేరులో..
వేలేరు : మండల కేంద్రంలో జరిగిన ఫూలే జయంతి వేడుకల్లో ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్, సబర్మతి పాఠశాల కరస్పాండెంట్ సురేశ్, లీగల్ అడ్వైజర్ కోడూరి రవి, మైనారిటీ సభ్యుడు ఖాసీం, నాయకుడు శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఐనవోలులో..
ఐనవోలు : మండల కేంద్రంలో కేవీపీఎస్, సీపీఎం, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఫూలే జయంతి నిర్వహించారు. సర్పంచ్ జన్ను కుమారస్వామి, ఎంపీటీసీ కొత్తూరి కల్పన, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు గబ్బెట రాంకుమార్, సీపీఎం మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య, నాయకులు పరమేశ్వర్, వెంకన్న, అశోక్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కరోనా ఎఫెక్ట్ : రెమ్డెసివిర్ ఎగుమతిపై నిషేధం
గోదారమ్మకు హరీశ్ రావు ప్రత్యేక పూజలు