శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో అప్నీ పార్టీ నేత గులాం హసన్ లోన్ మరణించారు. కుల్గామ్ జిల్లా దేవ్సర్లోని ఇంటి బయట ఉన్న ఆయనపై ఉగ్రవాదులు గురువారం కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పీడీపీ మాజీ బ్లాక్ అధ్యక్షుడైన గులాం హసన్ లోన్ కొన్ని నెలల కిందట బీజేపీకి మద్దతుగా ఉన్న అప్నీ పార్టీలో చేరారు. కాగా, ఆయనపై కాల్పులు జరిపి హత్య చేయడాన్ని అప్నీ పార్టీతోపాటు మాజీ సీఎంలు, పీడీఎఫ్ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, ఎన్సీ నేత ఒమర్ అబ్దుల్లా ఖండించింది.
కుల్గామ్లో గత పది రోజుల్లో ముగ్గురు నేతలు ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించారు. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో జమ్ముకశ్మీర్లోని భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం కుల్గామ్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి.