న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ నేత, జితిన్ ప్రసాద కాంగ్రెస్ పార్టీని వీడి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో బుధవారం బీజేపీలో చేరారు. రెండు సార్లు ఎంపీగా పనిచేసిన జితిన్ ప్రసాద రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరొందారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ పార్టీని వీడటం ఆ పార్టీకి ఎదురుదెబ్బగా పరిశీలకులు భావిస్తున్నారు.
కాగా జితిన్ ప్రసాద చేరికను బీజేపీ అధికారికంగా ప్రకటించింది. గతంలో జ్యోతిరాదిత్య సింధియా, హిమంత బిశ్వ శర్మ వంటి కీలక నేతలను దూరం చేసుకున్న కాంగ్రెస్ పార్టీని తాజాగా యూపీ రాజకీయాల్లో కీలక నేత జితిన్ ప్రసాద వీడటం ఆ పార్టీ వర్గాల్లో నైరాశ్యం అలుముకుంది. ఇక అంతకుముందు ఈరోజు మద్యాహ్నం 1 గంటకు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రముఖ నేత కాషాయ పార్టీలో చేరతారని ఆ పార్టీ ఎంపీ అనిల్ బబూలి ట్వీట్ చేశారు.