National
- Jan 22, 2021 , 12:44:46
VIDEOS
జార్ఖండ్లో ఘోరం.. మైకా గని పైకప్పు కూలి ఆరుగురు సజీవ సమాధి!

రాంచీ : జార్ఖండ్లో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. మైకా గని పైకప్పు కూలిన ఘటనలో ఆరుగురు సజీవ సమాధి అయినట్లు సమాచారం. ఈ ఘటన కోడెర్మా జిల్లాలో చేసుకుంది. ఇప్పటి వరకు రెండు మృతదేహాలను వెలికితీశామని, మిగతా వారి ఆచూకీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని కొడెర్మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ఎహ్తేషామ్ వక్వారిబ్ తెలిపారు. గురువారం సాయంత్రం కొడెర్మాలోని ఫుల్వారియా ప్రాంతంలో సుమారు ఎనిమిది మంది మైకా స్క్రాప్ సేకరిస్తున్నారని, ఈ క్రమంలో గని పైకప్పు కూలిపోయిందని పేర్కొన్నారు. పలువురు కేకలు వేయడంతో అక్కడే ఉన్న పలువురు ఇద్దరిని రక్షించగా.. మిగతా వారిని ఆచూకీ దొరకలేదని తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడ్డ ఇద్దరిని హాస్పిటల్కు తరలించి, చికిత్స అందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
- 13 అడుగుల భారీ కొండచిలువ కలకలం..!
- ఇక 24 గంటలూ కరోనా వ్యాక్సినేషన్
- నాగ్ అశ్విన్ కాలేజ్ ఈవెంట్ లో నన్ను చూశాడు: ఫరియా
- ఈఎస్ఐలో 6552 యూడీసీ, స్టెనోగ్రాఫర్ పోస్టులు
- ఎంజీఆర్ రూట్లో కమల్ హాసన్.. ఆ స్థానం నుంచే పోటీ !
- సౌదీ అరేబియాలో ప్రారంభమైన ‘వార్ఫేర్’
- బీజింగ్కు చెక్ : డ్రాగన్ పెట్టుబడి ప్రతిపాదనలపై ఆచితూచి నిర్ణయం!
- బ్రెజిల్లో ఒక్కరోజే 1641 కరోనా మరణాలు
- ‘సీటీమార్’ టైటిల్ ట్రాక్కు ఈల వేయాల్సిందే
- కోవిడ్ టీకా తీసుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్
MOST READ
TRENDING