సంగారెడ్డి : అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో సంగారెడ్డికి చెందిన మైత్రి ఫౌండేషన్ పారిశుద్ధ్య కార్మికులకు శనివారం నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. గుమ్మడిదాల మండలం కేంద్రంతో పాటు వీరన్నగూడెం, ఇతర గ్రామ పంచాయతీల్లోని పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన వస్తువులను అందజేసింది. శుక్రవారం సైతం అన్నారం, దోమడుగు, గుమ్మడిదాలలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. మైత్రి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సీహెచ్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ కాలంలోనూ పారిశుద్ధ్య కార్మికులు తమ విధులను నిర్వర్తించడం ద్వారా సమాజానికి గొప్ప సేవ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెర్వో చంద్రశేఖర్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎస్ఐ విజయ్కృష్ణ, జెడ్పీటీసీ కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.