న్యూఢిల్లీ: మిలిటరీ ఇంజినీర్ సర్వీసెస్ (ఎంఈఎస్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 17 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 502 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో సూపర్వైజర్, డ్రాట్స్మెన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
మొత్తం పోస్టులు: 502
ఇందులో సూపర్వైజర్ 458, డ్రాట్స్మెన్ 114 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: డ్రాట్స్మెన్ పోస్టులకు ఆర్కిటెక్చురల్ అసిస్టెన్స్షిప్లో డిప్లొమా చేయాలి, సూపర్వైజర్ పోస్టులకు ఎకనామిక్స్, కామర్స్, స్టాటిస్టిక్స్, బిజినెస్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఏదో ఒకదాంట్లో పీజీ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం తప్పనిసరి. అభ్యర్థులు 18 నుంచి 30 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారవ్వాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 17
వెబ్సైట్: mes.gov.in.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి