న్యూఢిల్లీ, జూలై 15: జేఈఈ మెయిన్ నాలుగో విడుత పరీక్షను వాయిదా వేశారు. సవరించిన తేదీల ప్రకారం ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2వ తేదీల్లో పరీక్షను నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం వెల్లడించారు. జేఈఈ మెయిన్ మూడు, నాలుగో విడుతల మధ్య ఎడం పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మారిన తేదీలతో రెండు సెషన్ల మధ్య నాలుగు వారాల వ్యవధి లభించడంతో విద్యార్థులు పూర్తిస్థాయిలో పరీక్షకు సంసిద్ధం కావొచ్చని తెలిపారు.