ఐఐటీ ఖరగ్పూర్ అధికారుల వెల్లడి
న్యూఢిల్లీ, మే 26: కరోనా కారణంగా ‘జేఈఈ అడ్వాన్స్-2021’ ప్రవేశపరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఐఐటీ ఖరగ్పూర్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం జూలై 3న ప్రవేశ పరీక్ష జరుగాల్సి ఉన్నదని, కానీ ప్రస్తుతం కరోనా ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకొని పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది. కాగా ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరుగాల్సిన జేఈఈ మెయిన్ పరీక్షలను కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.