పాట్నా : రెండేండ్ల క్రితం బీజేపీ ఆఫర్ను తిరస్కరించిన జేడీయూ ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో చేరడానికి సుముఖంగా ఉన్నదని సమాచారం. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ మంగళవారం ఢిల్లీ వెళ్లడం ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నది. కంటి చికిత్సకు కోసం ఆయన ఢిల్లీ వెళ్లినట్టు ఆయన పార్టీ నాయకులు చెబుతున్నా కేంద్ర క్యాబినెట్లో సముచిత వాటా కోసం బేరసారాలు సాగించడం కూడా ఆయన పర్యటన ఉద్దేశమని తెలుస్తున్నది. నితీశ్కు అత్యంత నమ్మకస్థుడుగా పేరున్న నేత రాజీవ్ రంజన్ సింగ్, కొన్ని నెలల కిందట జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా నియమితుడైన ఆర్సీపీ సింగ్ పేర్లు కేంద్ర మంత్రిపదవి రేసులో వినిపిస్తున్నాయి.