న్యూఢిల్లీ : ఈ నెల 31వ తేదీ నుంచి జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నవోదయ విద్యాలయాల్లో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు. 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో నవోదయాల్లో తరగతుల నిర్వహణ ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ప్రతి విద్యాలయంలో కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించింది.