కాచిగూడ,మార్చి 12: పట్టభద్రులు విశ్వసించి ఓటెయ్యండి తెలంగాణ రాష్ర్టాన్ని మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ నాయకుడు బద్దుల ఓంప్రకాశ్యాదవ్ ఆధ్వర్యంలో లింగంపల్లి టీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం అంబర్పేట నియోజకవర్గ భూత్లెవల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా మంత్రి శ్రీనివాస్యాదవ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. పేదల కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపిస్తాయని అన్నారు. నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణీదేని గెలిపించి, సీఎం కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్ శిరీషాయాదవ్, బద్దుల రవీందర్యాదవ్, సునీల్బిడ్లాన్, బి.కృష్ణాగౌడ్, నాగేందర్బాబ్జి, ఎర్ర భీష్మ, మన్నె శ్రీనివాస్యాదవ్, దిడ్డి రాంబాబు, కాలేరు భరత్, పడకంటి అంజయ్యచారి, ప్రభాకర్ ముదిరాజ్, పెంటయ్యచారి తదితరులు పాల్గొన్నారు. బబ్లూ, సదానంద్, శ్రీకాంత్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
గోల్నాక, మార్చి 12 : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5గంటలకు తుదిగడువు కావడంతో చివరి రోజు పట్టభద్రులను కలిసేందుకు ఆయా రాజకీయ పార్టీల నేతలు తలమునకలు కాగా.. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆఖరి రోజు అంబర్పేట నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి సురభివాణీదేవికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.