న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, ఎంపీ అంబికాసోనీ ఆ పార్టీ హైకమాండ్ ఇచ్చిన బంపర్ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవాలని పార్టీ హైకమాండ్ తనకు ఆఫర్ చేసిందని, అయితే ఆ ఆఫర్ను తాను అంగీకరించలేదని ఆమె చెప్పారు. అంతేగాక పంజాబ్కు సిక్కు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నూతన ముఖ్యమంత్రి ఎంపిక కోసం చండీగఢ్లో పార్టీ కేంద్ర పరిశీలకులు, రాష్ట్ర నాయకులు చర్చలు జరుపుతున్నారని చెప్పారు.
అంబికాసోనీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి అత్యంత సన్నిహితురాలు. పైగా ఆమెపై పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్కు, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద్ధూకు చాలా గౌరవం. ఈ నేపథ్యంలోనే అంబికాసోనీని ముఖ్యమంత్రిని చేస్తే ఎలాంటి వివాదం ఉండదని సోనియా భావించినట్లు తెలుస్తున్నది. కానీ, ఆరోగ్య పరిస్థితుల కారణంగానే సోనియాగాంధీ ఆఫర్ను అంబికాసోనీ తిరస్కరించారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.