న్యూఢిల్లీ: పొరుగు దేశాలతో మన విదేశాంగ విధానాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చిందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. ఒకప్పుడు పాకిస్థాన్, చైనా మినహా భారత విదేశాంగ విధానం వల్ల మిగతా పొరుగు దేశాలతో మంచి సంబంధాలు కలిగినట్లు చెప్పారు. అయితే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాలతో ఈ పరిస్థితి మారిందని చెప్పారు. మన పొరుగు దేశాలకు సంబంధించి మన విదేశాంగ విధానం ఎంత ప్రభావవంతంగా ఉన్నదో అన్నదానిపై సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో శరద్ పవార్ సోమవారం ఈ మేరకు వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకున్నది.