హైదరాబాద్, జూన్ 30, (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా 60రోజుల్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని ఆర్అండ్బీ, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వర్క్ ఏజెన్సీ ‘షాపూర్జీ పల్లోంజీ’ ప్రతినిధులకు స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు బుధవారం ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్రెడ్డి నిర్మాణ ప్రాంగణమంతా కలియతిరిగి పలు సూచనలు చేశారు. రోజువారీగా చేయాల్సిన పనులపై ఏజెన్సీ/వెండర్ల వారీగా వర్క్చార్ట్ రూపొందించుకొని త్వరగా పనులు చేయాలని సూచించారు. మంత్రి వెంట డీజీపీ మహేందర్రెడ్డి, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులు ఉన్నారు.