న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జమ్ముకశ్మీర్, లడఖ్లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో భారత సైనికులు జాతీయ పతాకాన్ని ఎగురువేశారు.
లడఖ్లోని పాంగాంగ్ సరస్సు వద్ద ఇండో-టిబెటన్ బార్డర్ పోలీసులు పంద్రాగస్టు వేడుకలను నిర్వహించారు. సరస్సు వద్ద జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. త్రివర్ణ పతాకంతో మార్చిఫాస్ట్ నిర్వహించారు.
అదేవిధంగా జమ్ములోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్లో స్థానికులతో కలిసి సైనికులు జాతీయ ఎగురవేశారు.
75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కశ్మీర్లోని బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.