కట్టంగూర్(నకిరేకల్),మార్చి 10: నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ అత్యధిక మెజార్టీతో గెలువడం ఖాయమని బీసీ కార్పొరేషన్ చైర్మన్ పూజర్ల శంభయ్య అన్నారు. నకిరేకల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనతో నాగార్జునసాగర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలిపారు. సాగర్లో నోముల చేసిన అభివృద్ధి పనులు, సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే భగత్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని పేర్కొన్నారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య సేవలను గుర్తించి నాగార్జునసాగర్ టికెట్ను నోముల భగత్కు కేటాయించిన సీఎం కేసీఆర్కు శంభయ్య ధన్యవాదాలు తెలిపారు.
నల్లగొండ రూరల్ : సాగర్ ఉప ఎన్నికలో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్కుమార్కు సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించడం పట్ల టీఆర్ఎస్ జిల్లా నాయకుడు మేకల యాదన్న యాదవ్, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ కొమ్మనబోయిన సైదులు యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సాగర్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు. సమావేశంలో సుంకరబోయిన సత్యనారాయణ, శివకుమార్, పోతెపాక నవీన్, సాయిచరణ్, మురళీ కృష్ణ, కిరణ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ రూరల్ : నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ కుమార్కు టికెట్ ప్రకటించడం పట్ల బీసీ సంఘం నాయకులు సోమవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. భగత్ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో లింగయ్య యాదవ్, చలికంటి యాదగిరి, చంద్రశేఖర్, భిక్షంగౌడ్, నాగయ్య, మేకల చిన లింగయ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
ఇవీ కూడా చదవండి..
వేతన జీవులకు రిలీఫ్: పీఎఫ్ వడ్డీపై పన్ను లిమిట్ పెంపు!
సొంత మెసేజింగ్ ప్లాట్ఫామ్పై మైక్రోసాఫ్ట్ మోజు.. అందుకోసమే..!