National
- Dec 26, 2020 , 22:07:20
రైతు నేతకు బీహార్ నుంచి బెదిరింపు ఫోన్కాల్

న్యూఢిల్లీ: భారతీయ కిసాన్ సంఘం (బీకేయూ) రైతు నేత రాకేశ్ తికైట్కు బీహార్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ 40 రైతు సంఘాలకు చెందిన రైతులు ఢిల్లీ సరిహద్దులోని సింఘు వద్ద గత నెల రోజులుగా నిరసన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు రైతు నేతలకు బెదిరింపులు వస్తున్నాయి. తాజాగా బీకేయూ అధికార ప్రతినిధి రాకేశ్ తికైట్కు శనివారం ఇలాంటి ఫోన్కాల్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియాకు వెల్లడించారు. ‘బీహార్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నన్ను ఆయుధాలతో చంపేస్తామని వారు బెదిరించారు. కాల్ రికార్డింగ్ను పోలీసు అధికారికి ఫార్వార్డ్ చేసాను. తదుపరి చేయవలసినది వారు చేస్తారు’ అని రాకేశ్ తిటికైట్ తెలిపారు.
తాజావార్తలు
- బైక్పై 4500 కి.మీల భారీయాత్రకు సిద్దమైన స్టార్ హీరో
- సూరత్ ప్రమాదం.. ప్రధాని, రాజస్థాన్ సీఎం సంతాపం
- హైదరాబాద్లో 50 కేజీల గంజాయి స్వాధీనం
- లైగర్ పోస్టర్ విడుదల .. బీరాభిషేకాలు, కేక్ కటింగ్స్తో ఫ్యాన్స్ రచ్చ
- తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు
- క్యాన్సర్ వైద్య నిపుణురాలు శాంత కన్నుమూత
- క్షమాపణ సరిపోదు.. అమెజాన్ను నిషేధిస్తాం : బీజేపీ
- లీటర్ పెట్రోల్ @ రూ. 85.. మరోసారి పెరిగిన ధర
- రుణయాప్ డైరెక్టర్లు చైనాకు..?
- గొర్రె, పొట్టేలుకు కల్యాణం.. ఎందుకో తెలుసా?
MOST READ
TRENDING