కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు భారతీయ జనతా పార్టీలో చేరి తప్పైందని ఆ పార్టీ కార్యకర్తలు అన్నారు. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్తో కలిసి పని చేయాలనుకుంటున్నాం. ఆ పార్టీలో చేరాలనుకుంటున్నాం. మమ్మల్ని క్షమించండి అంటూ బీజేపీ కార్యకర్తలు ఆటోలో ప్రచారం చేశారు. ఈ ఘటన బెంగాల్లోని బీర్భుమ్ జిల్లాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలంతా సమావేశమై టీఎంసీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
దీనిపై బీజేపీ జిల్లా నాయకత్వం స్పందిస్తూ.. టీఎంసీ నాయకుల బెదిరింపులు తాళలేకనే బీజేపీ కార్యకర్తలు తృణమూల్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. బహిరంగంగా క్షమాపణ కోరుతున్నారంటే తృణమూల్ నుంచి బెదిరింపులు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుందన్నారు.