దుబాయ్ : కరోనా ఇన్ఫెక్షన్ ఉధృతంగా మారడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో ఆక్సిజన్కు కొరత ఏర్పడింది. ఈ కొరతను నివారించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల చర్యలు తీసుకుంటున్నాయి. వైద్య ఆక్సిజన్ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం వివిధ దేశాలను సంప్రదించింది. అనేక దేశాల నుంచి ఆక్సిజన్ ఎయిర్లిఫ్ట్ ద్వారా భారత్కు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో సౌదీ అరేబియాలోని డమామ్ నౌకాశ్రయం నుంచి 4 క్రయోజెనిక్ ట్యాంకులలో 80 టన్నుల ఆక్సిజన్ భారతదేశానికి బయలుదేరింది.
ఈ బ్యాచ్ త్వరలో ముంద్రా పోర్టుకు చేరుకుంటుంది. మరోవైపు, మెడికల్ ఆక్సిజన్ సిలిండర్లను తయారు చేయడానికి ఉపయోగించే ఒక బ్యాచ్ పైపులు ఆదివారం కాండ్లా పోర్టుకు వచ్చాయి. ఎంవీ హాయ్ నామ్ 86 అనే నౌక హజీరా ఓడరేవు నుంచి కాండ్లా ఓడ రేవుకు చేరుకున్నది.
4722.82 టన్నుల స్టీల్ పైప్, 1389.47 మెట్రిక్ స్టీల్ బార్, 892.326 మెట్రిక్ టన్నుల జంబో బ్యాగ్, 170.535 ప్రాజెక్ట్ కార్గో కాండ్లాలో ల్యాండ్ అయ్యాయి. ఈ పైపుల సాయంతో ఆక్సిజన్ సిలిండర్లను తయారు చేస్తున్నట్లు కాండ్లా పోర్ట్ ప్రతినిధి ఓంప్రకాష్ దాడ్లాని తెలిపారు. వీటిలో కొన్ని బ్యాచ్లు భోపాల్కు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు.
భారీ అణు విషాదానికి 35 ఏండ్లు.. చరిత్రలో ఈరోజు
భారతదేశానికి మద్దతు తెలిపిన జర్మనీ
మూడవ దశ టీకాలకు మార్గదర్శకాలు జారీ
హిమాచల్లో ఏప్రిల్ 27 నుంచి 4 జిల్లాల్లో కర్ఫ్యూ
ఘజియాబాద్లో సిక్కుల ‘ఆక్సిజన్ లాంగర్’
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
దేశంలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియం ఎక్కడంటే..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..