సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): తలసేమియా వ్యాధిగ్రస్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. ఈ నెల 21న తన పుట్టిన రోజును పురస్కరించుకొని బంజారాహిల్స్లోని ఖాజా మ్యాన్షన్ ఫంక్షన్ హాల్లో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలనుకునే వారు 7093515573, 9030066666 నంబర్లలో సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలన్నారు. టీకా తీసుకున్న వారు14 రోజుల తర్వాత, కరోనా నుంచి కోలుకున్న వారు 28 రోజుల తర్వాత రక్తం ఇవ్వచ్చన్నారు.