న్యూఢిల్లీ: మహిళలపై వేధింపుల విషయంలో భారత్ను ఆఫ్ఘనిస్థాన్తో పోల్చిన ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి శోభా కరాంద్లజే తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అసదుద్దీన్ ఓవైసీని ఆఫ్ఘనిస్థాన్కు పంపించడం ఉత్తమమని, అక్కడ ఆయన వాళ్ల సమాజానికి, మహిళలకు రక్షణ కల్పిస్తారని కరాంద్లజే వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
కాగా, గురువారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన అసదుద్దీన్ ఓవైసీ.. దేశంలో ఐదేండ్లలోపు చిన్నారుల్లో ప్రతి 9 మందిలో ఒకరు మరణిస్తున్నారని, మహిళలపై వేధింపులు, నేరాలు పెరుగుతున్నాయని.. కానీ కేంద్ర సర్కారు మాత్రం ఆఫ్ఘనిస్థాన్లో మహిళల దుస్థితిపై ఆందోళన వ్యక్తంచేయడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇక్కడ అలాంటి దారుణాలు జరుగడం లేదా..? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు.