న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. 300 మందికి పైగా ఎంపీలు ఉన్న పార్టీని చూస్తే ఫలితం ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ఆయన చెప్పారు. ప్రశాంత్ కిషోర్ తనను రెండుసార్లు కలిసినట్లు శరద్ పవార్ తెలిపారు. అయితే ఆయన సంస్థ గురించి మాత్రమే తాము మాట్లాడుకున్నామని అన్నారు. ఎన్నికల వ్యూహాలను రూపొందించే రంగాన్ని విడిచిపెట్టినట్లు ప్రశాంత్ కిషోర్ తనతో చెప్పారన్నారు.
2024లో జరిగే లోక్సభ ఎన్నికలు లేదా రాష్ట్రపతి ఎన్నికలకు నాయకత్వం గురించి ప్రశాంత్ కిషోర్తో ఎలాంటి చర్చ జరుగలేదని శరద్ పవార్ తెలిపారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నదని, వీటిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. 2024 ఎన్నికలకు ఏ నాయకత్వం వహించబోనన్న ఆయన, అప్పటి పరిస్థితుల మేరకు రాజకీయాలు మారవచ్చని చెప్పారు.