జెరూసలేం: పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్తో 11 రోజుల పాటు జరిగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇరుపక్షాలు ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ జోక్యంతో పాలస్తీనాకు, ఇజ్రాయెల్కు మధ్య ఈ ఒప్పందం కుదిరింది. మంగళవారం ఆంటోనీ బ్లింకెన్తో సమావేశం అనంతరం నెతన్యాహు మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. హమాస్ గనుక శాంతిని భగ్నం చేసి, ఇజ్రాయెల్పై దాడులు చేస్తే తమ సమాధానం అత్యంత పవర్ఫుల్గా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.