కోల్కతా : బెంగాల్లో షాక్ల మీద షాక్లు తగులుతున్న భారతీయ జనతా పార్టీకి మరో షాక్ తగలబోతుందా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పలువురు బీజేపీని వీడి అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్లో చేరిన విషయం విదితమే. అదే బాటలో మరో సీనియర్ నాయకులు బీజేపీని వీడి టీఎంసీ గూటికి చేరనున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి.
బీదన్ నగర్ మాజీ మేయర్, బెంగాల్ బీజేపీ స్టేట్ సెక్రటరీ సవ్యసాచి దత్తా.. టీఎంసీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీఎంసీ అగ్ర నాయకత్వంతో ఆయన మాట్లాడినట్లు సమాచారం. అయితే 2019లో దుర్గాపూజకు ముందే సవ్యసాచి దత్తా టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. ఇప్పుడు కూడా ఆయన దుర్గాపూజకు ముందే టీఎంసీలో చేరే అవకాశం ఉంది. వచ్చే వారం బెంగాల్లో దుర్గాపూజను నిర్వహించనున్నారు.