న్యూఢిల్లీ : ఏడు జ్యోతిర్లింగాలతో పాటు ప్రముఖ పర్యాటక ప్రదేశాల సందర్శనకు భారతీయ రైల్వే అవకాశం కల్పిస్తున్నది. ఈ యాత్ర కోసం ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 5 మధ్య ‘భారత్ దర్శన్’ ప్రత్యేక రైలును నడుపనున్నది. 13 రోజులు సాగే ఈ యాత్రకు టికెట్ ధరను రూ.12,285గా నిర్ణయించినట్టు ఐఆర్సీటీసీ తెలిపింది. టికెట్లు ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా లభిస్తాయి. మరిన్ని వివరాలకు 8595924274, 8287930939 నంబర్లలో సంప్రదించవచ్చని ఐఆర్సీటీసీ తెలిపింది.