తులం రూ.44,059, కిలో వెండి రూ.65,958
న్యూఢిల్లీ, మార్చి 12: దేశంలో బంగారం, వెండి ధరలు మరోసారి దిగివచ్చాయి. ఢిల్లీలో శుక్రవారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.291 తగ్గి రూ.44,059కి చేరింది. అలాగే కిలో వెండి ధర రూ.1,096 తగ్గి.. రూ.65,958 దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి ధర తగ్గడం, రూపాయి విలువ పెరగడం ఇందుకు ప్రధాన కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్)తపన్ పటేల్ తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,707 డాలర్లకు, వెండి ధర 25.67 డాలర్లకు దిగొచ్చింది. కాగా, శుక్రవారం అమెరికన్ డాలర్తో రూపాయి మారకం విలువ 20 పైసలు పెరిగి 72.71కి చేరింది.