లండన్: లండన్లోని ఓ హోటల్కు వచ్చిన అనామక కస్టమర్.. బేరర్కు 16 వేల డాలర్ల టిప్ ఇచ్చిన ఘటన వెలుగు చూసింది. లండన్లోని న్యూ హంప్షైర్ రెస్టారెంట్లోని స్టాంబుల్ ఇన్ బార్ అండ్ గ్రిల్కు ఓ అనామక కస్టమర్ వచ్చాడు. డ్రింక్స్తోపాటు చిప్స్ తదితరాలు ఆర్డర్ చేశాడు. దాని బిల్లు 37.93 డాలర్లు మాత్రమే.
కానీ 16 వేల డాలర్ల టిప్ కలిపి 16,037.39 డాలర్లు బిల్లు వేశాడు బేరర్. దాన్ని చెల్లించి వెళ్లిపోయాడు సదరు అనామక కస్టమర్. తొలుత స్టాఫ్ ఈ సంగతి గుర్తించలేదు. అటుపై సదరు హోటల్ కం బార్ యజమాని మైక్ జారెల్లా గుర్తించారు. పొరపాటున జరిగి ఉండొచ్చునని భావించారు.
కరోనాను నియంత్రించడానికి ఈ రెస్టారెంట్ కొన్ని నెలల పాటు మూసివేశారు. ఔట్ డోర్ డైనింగ్ ఆర్డర్లు మాత్రమే తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారీగా వచ్చిన సదరు టిప్ను సిబ్బందికి పంపిణీ చేయాలని ప్లాన్ వేసుకున్నారు.
ఇంతకుముందు అమెరికాలో ఇండియన్ రెస్టారెంట్లోనూ ఇదే ఘటన జరిగింది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన ఒక కస్టమర్ సింబాలిక్గా 2020 టిప్ ఇచ్చి వెళ్లారు. కానీ ఆ కస్టమర్ చేసిన బిల్లు కేవలం 269 డాలర్లు మాత్రమే.