తప్పకుండా గుర్తింపు లభిస్తుంది
ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర
సాయుధ కానిస్టేబుళ్లకు పదోన్నతులు
ఎదులాపురం, ఏప్రిల్ 23 : క్రమ శిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, అ లాంటి వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నా రు. జిల్లా కేంద్రంలోని పోలీస్ ముఖ్య కార్యాలయంలో శుక్రవారం 9 మంది సాయుధ కానిస్టేబుళ్లకు పదోన్నతిగా హెడ్ కానిస్టేబుల్ చిహ్నాన్ని ఆయన అలంకరించారు. ఈ సందర్భంగా రాజే శ్ చంద్ర మాట్లాడుతూ.. త్వరలో ఉమ్మడి జిల్లాలో ఖాళీలను బట్టి బదిలీ ఉత్తర్వులు వెల్లడిస్తామన్నారు. ప్రతి నెలా ఏర్పడిన ఖాళీలను పదోన్నతులు కల్పించి వెనువెంటనే భర్తీచేస్తామని తెలిపారు. త్వరలో మరిన్ని విభాగాల్లో పదోన్నతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. పదోన్నతి పొందిన వారిలో ఏఆర్ కానిస్టేబుళ్లు, 2007 బ్యాచ్కు చెందిన పీ సంజీవరెడ్డి, మహమ్మద్ అక్బర్, కే సర్దార్ సింగ్, కే భగవాండ్లు, ఎస్ రాజేశ్వర్ రెడ్డి, కే అనురథ్, కే మేఘాశ్యామ్, ఎం రామ్గోపాల్, టీ మల్లేశ్ ఉన్నారు. ఈ సమావేశంలో రిజర్వ్ సీఐ గడికొప్పుల వేణు, ఎస్పీ సీసీ దుర్గం శ్రీనివాస్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు కార్యదర్శి గిన్నెల సత్యనారాయణ, ప్రతినిధులు కే అడెల్లు, చిందం దేవిదాస్, సీఆర్ గంగారం పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
IPL 2021: ముంబైకి షాక్.. అలవోకగా గెలిచిన పంజాబ్
IPL 2021: తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్