తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పెంచుతూ ఇంటర్మీడియట్ బోర్డు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫిబ్రవరి 4 వరకూ ఈ గడువును పెంచుతున్నట్లు బోర్డు పేర్కొంది. ఈ నిర్ణయం ఇంటర్ మొదటి సంవత్సరంతో పాటు ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు కూడా వర్తిస్తుందని తెలిపింది. ఫైన్తో కట్టే వారు మాత్రం ఫిబ్రవరి 24 వరకూ ఫీజు కట్టుకోవచ్చని బోర్డు స్పష్టం చేసింది. నిజానికి జనవరి 5 తోనే పరీక్ష ఫీజు గడువు పూర్తవుతుంది. అయితే సంక్రాంతి సెలవులను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 200 రూపాయల ఫైన్తో చెల్లించే వారు ఫిబ్రవరి 10, 1000 రూపాయల ఫైన్తో చెల్లించేవారికి ఫిబ్రవరి 17, 2000 రూపాయల ఫైన్తో చెల్లించే వారు ఫిబ్రవరి 24 వరకూ చెల్లించవచ్చని బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.