కంటోన్మెంట్, మే 28:పోలీసులు చిరువ్యాపారిని బెదిరించి.. మామిడి పండ్లను ఉచితంగా తీసుకున్నట్లు నిరాధారమైన వార్తను పోలీసుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా వీడియోలను ప్రసారం చేసినందుకుగాను బోయిన్పల్లి పోలీసులు శుక్రవారం ఓ యూట్యూబ్ చానల్పై కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. లాక్డౌన్ నేపథ్యంలో నిద్రాహారాలు మాని అహర్నిశలు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు వార్తను ప్రసారం చేసి.. తమ మనోభావాలను దెబ్బతీసి, ప్రజలను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈనెల 27న ఎస్సై యుగంధర్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు ‘వతన్ కీ పుకార్’ యూట్యూబ్ చానల్ తోపాటు అందులోని వక్త మొహమ్మద్ అబ్దుల్ బారీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.