చండీగఢ్: పంజాబ్లో కాంగ్రెస్ పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నదని కేంద్ర మాజీ మంత్రి, శిరోమణి అకాలీదల్ నాయకురాలు హర్సిమ్రత్ కౌర్ బాదల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలన కారణంగా రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని విమర్శించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా సరిగా సాగడంలేదని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించే అంశాన్ని పక్కనపెట్టి.. ఢిల్లీలో పదవుల కోసం కొట్లాడుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు.
పంజాబ్లో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఇటీవల విభేదాలు వచ్చాయి. దాంతో కొందరు నేతలు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్పై కాంగ్రెస్ హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల వారిని విడివిడిగా ఢిల్లీకి పిలిపించి మాట్లాడిన కాంగ్రెస్ అధిష్ఠానం.. చివరకు కెప్టెన్ అమరీందర్సింగే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో హర్సిమ్రత్ కౌర్ కాంగ్రెస్పై విమర్శలు చేశారు.