న్యూఢిల్లీ: భారత నావికాదళానికి చెందిన ఏఎస్డబ్లూ కొర్వెట్టి క్లాస్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ కిల్తాన్ శనివారం తూర్పు చైనా సముద్రంలో దక్షిణ కొరియాకు చెందిన డేగు-క్లాస్ యుద్ధనౌక ఆర్వోకేఎస్ జియోంగ్నమ్తో కలిసి నేవీ పార్ట్నర్షిప్ విన్యాసాలు నిర్వహించింది. ఈ విన్యాసాల కోసం భారత యుద్ధ నౌకను తూర్పు చైనా సముద్ర జలాల్లో మోహరించినట్లు భారత నావికాదళం తెలిపింది.