కుత్బుల్లాపూర్, మే 8 : స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటా తీసుకొచ్చిన చెత్త ను తిరిగి జవహర్నగర్ డంపింగ్యార్డుకు తరలించేందుకు ప్రణాళికా బద్ధం గా తగిన చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత అధికా రులకు పలు సూచనలు చేశారు. శనివారం కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిల్ పరిధిలో పలు ప్రాంతాల్లో పర్యటించి శానిటేషన్పై విస్తృత ప్రచారం చేపట్టారు. ఐడీపీఎల్ చౌరస్తా నుంచి కుత్బుల్లాపూర్ చౌరస్తా వరకు ఉన్న ఫుట్పాత్లను పాదచారులకు అనుకూలంగా ఉండేలా మరింత సుందరీకరణ గా తీర్చిదిద్దాలని సూచించారు. దీంతో పాటు వెన్నలగడ్డలో ఉన్న సెకండ్ ట్రాన్స్ఫర్ పాయింట్ను సందర్శించి సిబ్బంది, అధికారులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట కుత్బుల్లాపూర్ ఉప కమిషనర్ మంగతాయారు, ఏఎంహె చ్వో భానుచందర్, సిబ్బంది ఉన్నారు.