ఆగస్టు నుంచి మొదలు
న్యూఢిల్లీ, జూలై 10: లావాదేవీలపై పరిమితుల్ని, చార్జీలను ఐసీఐసీఐ బ్యాంక్ సవరించింది. ఆగస్టు 1 నుంచి బ్యాంక్ ఖాతాదారులు ఉచిత లావాదేవీల్ని మించి ఏటీఎంల్లో నగదు విత్డ్రా చేస్తే మరింత ఎక్కువ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఏటీఎంల్లో నగదు విత్డ్రాయల్స్, చెక్బుక్స్, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కొత్త మార్పులు.. పొదుపు ఖాతాలతోపాటు సాలరీ ఖాతాలకూ వర్తిస్తాయని బ్యాంక్ తెలిపింది.