హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది మృతి

శ్రీనగర్ : దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో డిసెంబర్ 17వ తేదీన ఉగ్రవాదులు సైనికులను లక్ష్యం చేసుకుని కాల్పులు జరిపారు. సంగం - నైనా రోడ్డు ఈ క్రమంలో బలగాలు కూడా కాల్పులు జరపడంతో ఓ ఉగ్రవాది తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకుని శ్రీ మహారాజా హరిసింగ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఉగ్రవాది మృతి చెందాడు. ఆ ముష్కరుడిని హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన జహీర్ అబ్బాస్ లోనేగా పోలీసులు గుర్తించారు.
పట్టుబడిందిలా..
డిసెంబర్ 17న అర్ధరాత్రి అనంత్నాగ్లోని సంగం - నైనా రహదారిపై ఇద్దరు ముష్కరులు బైక్పై వెళ్తున్నారు. వారిని ఆపేందుకు బలగాలు యత్నించాయి. ఈ క్రమంలో బైక్పై వెనుకాల ఉన్న ఉగ్రవాది కాల్పులు జరిపాడు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. గాయపడ్డ ఉగ్రవాదిని అరెస్టు చేసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తాజావార్తలు
- భూ తగాదాలతో వ్యక్తి హత్య
- యాదాద్రిలో భక్తుల రద్దీ..
- పాత నోట్లపై కేంద్రం క్లారిటీ..!
- తిరుమలలో త్రివర్ణ పతాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో
- కాళేశ్వరం నిర్వాసితులకు ఉత్తమ ప్యాకేజీ
- అమర్నాథ్ యాత్ర కోసం ఏర్పాట్లు షురూ!
- రియల్మీ X7 సిరీస్ విడుదల తేదీ ఖరారు!
- అనైతిక బంధం : సోదరిని కాల్చిచంపిన వ్యక్తి
- అయోధ్యలో మసీదు నిర్మాణ పనులు షురూ..
- ఉర్దూ పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి కొప్పుల