మహబూబాబాద్ : తొర్రూరు శివారులోని ఓ మామిడితోట యజమానులు క్రూరమైన చర్యకు పాల్పడ్డారు. మామిడికాయల దొంగతనం కోసం వచ్చారంటూ ఇద్దరు బాలురను చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. దీంతో ఆ ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
బాధిత బాలుర కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పిల్లలను కొట్టిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ వారిద్దరిని డీఎస్పీ వెంకట రమణ మీడియా ముందు ప్రవేశపెట్టారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుచుతామని డీఎస్పీ వెల్లడించారు.