న్యూఢిల్లీ: ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ( Income Tax Portal )లో ఎదురవుతున్న అవాంతరాలపై వివరణ ఇవ్వడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిశారు ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్. సోమవారం ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లిన ఆయన.. అసలు సమస్యను వివరించారు. పోర్టల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల గురించి పరేఖ్ వివరించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త పోర్టల్ ప్రారంభించి రెండున్నర నెలలు అవుతున్నా.. ఇప్పటికీ అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం.. ఆదివారం ఇన్ఫోసిస్కు సమన్లు జారీ చేసింది. జూన్లో ఈ కొత్త సైట్ లాంచ్ కాగా.. మరుసటి రోజే ఇందులోని సమస్యలను పరిష్కరించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇన్ఫోసిస్కు ఆదేశాలు జారీ చేశారు.