శ్రీనగర్: దేశ సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైనికులు భగ్నం చేశారు. జమ్మకశ్మీర్ పూంచ్ సెక్టారులోని సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద.. సోమవారం తెల్లవారుజామున పాక్ మద్ధతున్న ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వారిని భారత దళాలు ఇంటిగ్రేటెడ్ నిఘా గ్రిడ్ ద్వారా వారిని గుర్తించాయి. ఈ క్రమంలో చొరబాటుదారులను సైనికులు నిలిపివేయడంతో వారు కాల్పులకు దిగారు. దీంతో భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతం అయ్యాడు. అతని నుంచి ఏకే-47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో చొరబాటుదారుల కోసం ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నది.