ఇండోర్: రోజురోజుకు దొంగలు తెలివి మీరిపోతున్నారు. దొంగతనాలు చేసే తీరు, ఆ దొంగతనానికి ఉపయోగించే ఆయుధాల విషయంలో కొత్త మార్గాలు అనుసరిస్తున్నారు. ఒకప్పుడు కత్తులు, తుపాకులు లాంటి మారణాయుధాలను చూపించి దోచుకునే దొంగలు ఇప్పుడు మారణాయుధాలు లేకున్నా దోచుకోవడం నేర్చుకున్నారు. మారణాయుధాలను పోలిన వస్తువులను చూపించి కూడా జనాన్ని భయపెట్టి దోచుకుంటున్నారు.
తాజాగా మధ్యప్రదేశ్లో ఇలాంటి ఘటనే జరిగింది. ఇండోర్లోని సన్యోగితాగంజ్లోగల ఓ పెట్రోల్పంప్లో క్యాషియర్గా పనిచేస్తున్న వ్యక్తి దగ్గరకు ఇద్దరు ఆగంతకులు వెళ్లారు. వారి దగ్గరున్న ఫ్యాన్సీ లైటర్తో క్యాషియర్కు గురిపెట్టి డబ్బు కావాలని డిమాండ్ చేశారు. ఆ ఫ్యాన్సీ లైటర్ అచ్చం పిస్తోల్ లాగనే ఉండటంతో భయపడిపోయిన క్యాషియర్ తన దగ్గరున్న రూ.2100 వారికి ఇచ్చేశాడు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు చేపట్టి సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగలిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే, దొంగలు పిస్తోల్ పేరుతో పెట్రోల్ పంప్ క్యాషియర్కు చూపించింది ఫ్యాన్సీ లైటర్ అని తెలుసుకుని పోలీసులు ఆశ్చర్యపోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు
‘స్పుత్నిక్ వి’కి డీసీజీఐ గ్రీన్సిగ్నల్
కరోనా ఎఫెక్ట్: లాక్డౌన్ భయంతో స్వస్థలాలకు వలస కార్మికులు
రెండు కాళ్లు, మూడు చేతులతో.. ఒడిశాలో జన్మించిన అవిభక్త కవలలు
రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు
ఎఫ్ 3 చిత్రంలో వకీల్ సాబ్ బ్యూటీ..!