బీజింగ్: కరోనా వైరస్ పుట్టింది భారత్లో కాదు. కానీ, ప్రపంచ దేశాల్లోకెల్లా ఇప్పుడు అత్యంత వేగంగా విజృంభిస్తున్నది మాత్రం భారత్లోనే. గత వారం రోజుల నుంచి అయితే పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. రోజూ మూడు లక్షలకు తగ్గకుండా రోజువారీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో కూడా 3.49 లక్షల పైచిలుకు కొత్త కేసులు నమోదయ్యాయి.
అయితే, భారత్లో ఇంతలా విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారి తనకు పుట్టినిల్లయిన చైనాలో మాత్రం కాలుకూడా పెట్టలేకపోతున్నది. గడిచిన 24 గంటల్లో చైనా మెయిన్ ల్యాండ్లో కేవలం 13 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. షాంఘైలో 9 మందికి, ఫుజియాన్లో ముగ్గురికి, తియాంజిన్లో ఒకరికి కరోనా పాజిటివ్గా తేలింది. అయితే, ఆ 13 కేసుల్లోనూ ఒక్కటి కూడా స్థానికుల్లో నమోదు కాలేదని, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన చైనీయుల్లో బయటపడ్డాయని చైనా సర్కారు వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
ఒంట్లో వేడిని తగ్గించే ఈ చిట్కాలు మీకు తెలుసా..?
మమతాజీ.. బెంగాలీలు ఎవరికీ భయపడరు: జేపీ నడ్డా
దేశాన్ని మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేసింది: ప్రధాని మోదీ
రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో వర్షాలు : ఐఎండీ
కొవిడ్ హాస్పిటల్లో మంటలు.. 23 మంది రోగుల మృతి
సుప్రీం కోర్టు జడ్జి మోహన్ ఎం శాంతనగౌడర్ కన్నుమూత
రాష్ట్రంలో కొత్తగా 8 వేల కరోనా కేసులు