రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
ప్రశాంత్నగర్, ఏప్రిల్ 6 : ప్రజలకు.. పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించే నెక్లెస్ రోడ్డు అసంపూర్తి పనులన్నీ త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులు, కాంట్రాక్టర్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ఈ నెల 8న కోమటి చెరువు నెక్లెస్ రోడ్డు ప్రారంభించనున్న నేపథ్యంలో మంగళవారం సుందరీకరణ పనులు పరిశీలించారు. గ్లో గార్డెన్ సుందరీకరణ పనులు, నెక్లెస్ రోడ్డు అభివృద్ధి పనులు, గ్లో గార్డెన్స్లో విద్యుత్ కాంతుల విరజిమ్మే అంశాలపై టూరిజం ఎండీ మనోహర్తో చర్చించారు. మూడు రీచ్లుగా చేపట్టిన నెక్లెస్ రోడ్డును త్వరలో అందుబాటులోకి తేస్తామని మంత్రి తెలిపారు. విద్యుత్ దీపాల వెలుగులతో కాంతులీనుతున్న నెక్లెస్ రోడ్డు ప్రారంభానికి సిద్ధమైందన్నారు. నెక్లెస్ రోడ్డుపై తిరుగుతూ రెయిలింగ్, అర్చ్, ఫుట్పాత్, కుర్చీ బల్లలు, విద్యుత్ దీపాల ఏర్పాటు, సైక్లింగ్, వాకింగ్ ట్రాక్లపై క్షుణ్ణంగా పరిశీలించారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, మున్సిపల్ ఈఈ వీరప్రతాప్, ఏఈ మహేశ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
విశ్వనగరం కోసం కనీవినీ ఎరుగని రీతిలో పనులు
సలాం ఇబ్రహీంపేటలో పాల్గొన్న హోంమంత్రి
ఉచిత విద్యుత్ అందుకోనున్న 25వేల క్షౌరశాలలు