మేడ్చల్ కలెక్టరేట్, జూలై 12 : ప్రతి కాలనీ అభివృద్ధికి కృషి చేస్తామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి తెలిపారు. మున్సిపల్ పరిధిలోని రాంపల్లి ఆర్ఎల్ నగర్, భరత్ నగర్లో సీసీ రోడ్డు పనులను సోమవారం చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం నాగారంలో ఉన్న వైకుంఠధామాన్నిచైర్మన్ పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎ.వాణి రెడ్డి, వైస్ చైర్మన్ మల్లేశ్, కౌన్సిలర్లు లక్ష్మి, నాయకులు వేణు పాల్గొన్నారు.