న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ శరవేగంగా వ్యాపిస్తున్నది. రోజువారీ పాజిటివ్ కేసులు 12 రోజుల్లో డబుల్ అవుతున్నాయి. 8 శాతంగా ఉన్న పాజిటివ్ రేటు 16.69 శాతానికి పెరిగింది. అలాగే గత నెలలో వారాంత పాజిటివిటి రేటు కూడా 3.05 శాతం నుంచి 13.54 శాతానికి పెరిగింది.
ఛత్తీస్గఢ్లో అత్యధికంగా వీక్లీ పాజిటివిటి రేటు 30.38 శాతంగా ఉన్నది. 24.24 శాతంతో గోవా, 24.17 శాతంతో మహారాష్ట్ర, 23.33 శాతంతో రాజస్థాన్, 18.99 శాతంతో మధ్యప్రదేశ్ తర్వాత స్థానాల్లో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.