న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ 50 కోట్ల మైలురాయిని చేరింది. శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయానికి అందిన ప్రొవిజనల్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 50,03,48,866 మంది ప్రజలు కరోనా టీకా పొందారు. మరోవైపు శుక్రవారం ఒక్క రోజే దేశవ్యాప్తంగా 43,29,673 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు వెల్లడించింది. వ్యాక్సినేషన్ 50 కోట్ల మైలురాయిని దాటడంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ హర్షం వ్యక్తం చేసింది.