కార్పొరేషన్, ఏప్రిల్ 16: నగరంలోని కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని కమిషనర్ క్రాంతి ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ప్రస్తుతం 8 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రత్యేకాధికారులుగా అసిస్టెంట్ కమిషనర్ రాజేశ్వర్, డిప్యూటీ కమిషనర్ త్రయంబకేశ్వర్, ఈఈ రామన్, శానిటేషన్ సూపర్వైజర్ రాజమనోహర్ను నియమించినట్లు పేర్కొన్నారు. రామన్కు హౌసింగ్బోర్డుకాలనీ, విద్యానగర్ (కుర్మవాడ), డీసీకి మోతాజీఖాన, బీఆర్ఆర్ కాలనీ, ఏసీకి సప్తగిరికాలనీ, దన్గర్వాడీ స్కూల్, రాజమనోహర్కు అంబేద్కర్ స్టేడియం, కట్టరాంపూర్ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. 45 ఏళ్లుపైబడిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేలా చూడాలన్నారు. కేంద్రాల వద్ద డాటా ఎంట్రీ సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. బల్దియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
స్మార్ట్ టాయిలెట్స్ శుభ్రంగా ఉంచాలి
కార్పొరేషన్, ఏప్రిల్ 16: నగరంలో నిర్మించిన స్మార్ట్ టాయిలెట్స్ను పరిశుభ్రంగా ఉంచాలని కమిషనర్ క్రాంతి ఆదేశించారు. శుక్రవారం ఆమె తన చాంబర్లో టాయిలెట్స్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పరిశుభ్రత విషయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు మరుగుదొడ్లను తెరిచి ఉంచాలన్నారు. ప్రతి మరుగుదొడ్డిలో సబ్బులు, నాప్కిన్లు, శానిటైజర్ ఉంచాలని సూచించారు. ఎల్ఎండీ వద్ద నిర్మించిన టాయిలెట్స్ను త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సమావేశంలో ఏజెన్సీ ప్రతినిధులు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
నిజామాబాద్ జిల్లా దవాఖానలో మృతదేహాలు తారుమారు
IPL 2021: ఆదుకున్న షారుక్ ఖాన్.. పంజాబ్ స్కోరు 106