గాంధారి/బీబీపేట్/నాగిరెడ్డిపేట్/దోమకొండ/విద్యానగర్/లింగంపేట/సదాశివనగర్, జూన్ 1 :
రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లావ్యాప్తంగా మంగళవారం కొనసాగింది. వ్యాపారులు ఉదయం 6 నుం చి ఒంటిగంట వరకు దుకాణాలను తెరిచి ఉంచారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ప్రజలు రోడ్లపైకి రాలే దు. వివిధ మండలాలు, గ్రామాల్లోని ప్రధానకూడళ్ల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గం టల నుంచి ప్రజలు బయటికి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి
గాంధారి మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతున్నది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రజలు రోడ్లపైకి రాకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. లాక్డౌన్ సడలింపు సమయంలోనే బయటికి రావాలని ఎస్సై శంకర్ సూచించారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
బీబీపేట్ మండలంలో లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. ఎస్సై మహేందర్, సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వ్యాపారులు దుకాణాలను తెరిచి ఉంచారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రజలు రోడ్లపైకి రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.
నాగిరెడ్డిపేట్ మండలకేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో మంగళవారం లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగింది. మండలకేంద్రంలో దుకాణాలను మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెరిచి ఉంచారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రజలు రోడ్లపైకి రాకపోవడంతో మండల కేంద్రం బోసిపోయింది.
దోమకొండ మండలకేంద్రంలో మంగళవారం కొనసాగిన లాక్డౌన్ను ఎస్సై రాజేశ్వర్గౌడ్ పర్యవేక్షించారు. ఒంటి గంటకు దుకాణాలను మూసివేయాలని వ్యాపారులకు సూచించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రజలు బయటికి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు.
కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్ కట్టడికి పోలీసులు లాక్డౌన్ను పకడ్బందీగా నిర్వహించారు. పట్టణంలో పలువురు వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ను నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారికి పోలీసులు జరిమానా విధించారు.
లింగంపేటలో మంగళవారం లాక్డౌన్ కొనసాగింది. లాక్డౌన్ సడలింపు సమయం తర్వాత ప్రజలు రోడ్లపైకి రాకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు దుకాణాలు మూసివేసిన తర్వాత లింగంపేట నిర్మానుష్యంగా మారింది.
సదాశివనగర్ మండలంలోని పద్మాజివాడి ఎక్స్ రోడ్డు వద్ద జాతీయరహదారిపై ఎస్సై శేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత రోడ్లపైకి వచ్చిన వాహనాలను సీజ్ చేశామని ఎస్సై తెలిపారు.