వినాయక్నగర్, మే 14: కరోనా కట్టడికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని జోనల్ కమిషనర్ మమత అన్నారు. శుక్రవారం ఉదయం అల్వాల్ సర్కిల్ పరిధిలోని అల్వా ల్, వెంకటాపురం, మచ్చ బొల్లారంలోని మంగపురం పార్కు అభివృద్ధి, కమలాలయ ఎన్క్లేవ్లో వరదనీటి డ్రైనేజీ, పారిశుధ్య పనులను జడ్సీ పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్సీ మమత మాట్లాడుతూ వైరస్ను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాద య్య, డీఈ మహేశ్, శర్మ, మహేందర్రెడ్డి పాల్గొన్నారు.
కరోనా వైరస్ వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం ఉదయం వినాయక్నగర్ డివిజన్ శారదానగర్, అంబేద్కర్నగర్, శివానగర్, మినీ ట్యాంక్బండ్ రోడ్డు, వినాయక్నగర్ మెయిన్ రోడ్డు, వెంకటాపురం డివిజన్లో నందికంటి శ్రావణ్కుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇందిరానగర్ బస్తీలో కరోనా వైరస్ వ్యాపించకుండా హైపోక్లోరైట్ రసాయనాన్ని పిచికారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఓంప్రకాశ్, గోపాల్, రాకేశ్యాదవ్, సంతోశ్, సాయిసురేశ్, నవీన్, శశిగౌడ్, రాంప్రసాద్, రాజు, కృష్ణ, వెంకటాపురం డివిజన్ నాయకులు శ్రీనివాస్, శివకుమార్, సత్తి, పద్మ, ముత్యాలమ్మ, శ్రీలత పాల్గొన్నారు.
అడ్డగుట్ట: అడ్డగుట్ట, తుకారాంగేట్లోని పలు ప్రాంతా ల్లో బీజేపీ సికింద్రాబాద్ జాయింట్ కన్వీనర్ సీహెచ్ కన్నాభిరాం ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైట్ రసాయనాన్ని పిచికారీ చేయించారు. కన్నాభిరాం మాట్లాడుతూ మేకల సారంగపాణి సహకారంతో బస్తీల్లో పిచికారీ చేయించారు. ప్రజలు కరోనా నివారణకు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరేందర్, హంసరా జు, హర్షకిరణ్, రాజుగౌడ్, తదితరులు పాల్గొన్నారు.